Homeహైదరాబాద్latest Newsగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కేసీఆర్ ఫోకస్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కేసీఆర్ ఫోకస్

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ఉంది. ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలనిబిఆర్ఎస్, ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కాంగ్రెస్, నిరుద్యోగులు తమ వైపే ఉన్నారని బిజెపి గెలుపు పై ధీమాగా ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు కోసం గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో మూడు జిల్లాల ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో రేపు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఒక్కరు కూడా మిస్ కాకూడదని ఇప్పటికే కీలక నేతలకు సమాచారం అందించారు. ఈ సమావేశంలో తాజా రాజకీయాలపై చర్చ జరగనుందని తెలుస్తుంది..

Recent

- Advertisment -spot_img