Homeతెలంగాణతెలంగాణ మొత్తానికే కేసీఆర్ లోకల్

తెలంగాణ మొత్తానికే కేసీఆర్ లోకల్

– ఆయన రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుంది
– పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదే
– మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కేసీఆర్‌ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ అన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. మంగళవారం కామారెడ్డిలో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు లోకల్‌, నాన్‌ లోకల్‌ ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. ‘అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు.. ఇక్కడ రాష్ట్రాన్నే తెచ్చిన సీఎం ఉన్నారు. ఆయనకు లోకల్‌, నాన్‌లోకల్‌ ఉంటుందా?కేసీఆర్‌ తెలంగాణ మొత్తానికే లోకల్‌. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల్లో ఎవరు లోకల్‌? కేసీఆర్‌ అమ్మగారి ఊరు ఇక్కడే సమీపంలోని కోనాపూర్‌. అలాంటప్పుడు ఎవరు లోకల్‌?’అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు పెన్షన్లు లేవు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బీడీ కార్మికుల పెన్షన్​కు కటాఫ్‌ డేట్‌ తొలగిస్తాం. రాష్ట్రంలో 4.5లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం. మరోసారి అధికారంలోకి వస్తే పెన్షన్లను దశలవారీగా రూ.5వేలకు పెంచుతాం. జనవరిలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తాం. రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ రూ.5లక్షల బీమా కల్పిస్తాం. అసైన్డ్‌ భూములపై యజమానులకు పూర్తి పట్టా హక్కులు ఇస్తాం’అని కేటీఆర్‌ అన్నారు.

Recent

- Advertisment -spot_img