Homeహైదరాబాద్latest Newsఎర్రవల్లిలో ముగిసిన కేసీఆర్ ఎల్పీ స‌మావేశం

ఎర్రవల్లిలో ముగిసిన కేసీఆర్ ఎల్పీ స‌మావేశం

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశం దాదాపు మూడున్నర గంటల పాటు జరిగింది. డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రభుత్వ ఏడాది వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని అనేక సమస్యలను కేసీఆర్ ప్రస్తావించారు. కేసీఆర్ ఫాంహౌస్ లో మాజీ మంత్రులు మల్లార్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు వెంకట్‌రాంరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందగౌడ్‌, శంబీపూర్‌ రాజు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్ర రెడ్డి, మధుసూదనాచారి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Recent

- Advertisment -spot_img