Homeహైదరాబాద్latest Newsకేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో ఉంచారు: కేటీఆర్

కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో ఉంచారు: కేటీఆర్

కేసీఆర్‌ సాధించిన ఆర్థిక ప్రగతి చెరిపేస్తే చెరగని సత్యం అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పెద్ద రాష్ట్రాలలో రూ.3.09 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. అయినా కేసీఆర్‌ ఏం చేశారని మీడియా, ప్రతిపక్షాలు అంటున్నాయని విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.
కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో ఉంచారని.. అయినా ఏమి చెసినవ్ కేసిఆర్ అని మీడియా, ప్రతిపక్షాలు అంటున్నాయి.. చేరిపెస్తే చెరగని సత్యం కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి. జై తెలంగాణ!’ అంటూ ట్వీట్‌ చేశారు.

Recent

- Advertisment -spot_img