New Ration Card: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులు తీసుకునే బిపిఎల్ కుటుంబాలకు మూడు రంగుల కార్డులు, ఎపిఎల్ కుటుంబాలకు గ్రీన్ కార్డులు ముద్రిస్తున్నట్లు ఆయన తెలిపారు. మీకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా, మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉంటే, ఏప్రిల్ 1 నుండి సన్న బియ్యం తీసుకోవచ్చని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.