Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు..!

హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు..!

గణేషుడి భక్తులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త. నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టారు. సెప్టెంబరు 17వ తేదీ మంగళవారం నామజ్జనం రోజున మెట్రో సేవలు పొడిగించనున్నారు. వినాయక నిమజ్జనాలు జరిగే మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రోరైళ్లు నడపనున్నారు. చివరి స్టేషన్ల నుంచి ఒంటి గంటకు బయలుదేరి.. గమ్యస్థానానికి రెండు గంటల వరకు చేరుకుంటాయి. నిమజ్జనం ముగిసేవరకు అవసరాన్ని బట్టి, రద్దీవేళల్లో అదనపు మెట్రో ట్రిప్పులు నడపనున్నట్లు హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img