మూసీ నిర్వాసితులకు 16 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు 10,200 మంది నిర్వాసితులను గుర్తించినట్లు ప్రభుత్వం తెలిపింది. ముందుగా రివర్ బెడ్ లోని 1600 ఇళ్లను తొలగించనున్నట్లు తెలుస్తోంది. RFCTLARR చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించనుంది. పట్టా భూమి ఉంటే ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చుతో పాటు భూమి విలువ కూడా చెల్లించాలని నిర్ణయించనుంది.