ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం ఈ నెల 31 వరకు పొడిగించింది. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. గతంలో హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసుపై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది.