అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న జరగనుంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి వివాహం జరగనుంది. అయితే వీరి పెళ్లి పూర్తిగా బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం జరగనుందట. శోభిత తల్లిదండ్రుల కోరిక మేరకు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగబోతోందని సమాచారం. ఈ పెళ్లికి 300 మంది గెస్ట్ లు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. వీరి పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు సమాచారం.