Homeరాజకీయాలుకిషన్​ రెడ్డీ.. కట్టుకథలు ఆపండి

కిషన్​ రెడ్డీ.. కట్టుకథలు ఆపండి

– కేంద్రం వల్లే 24 గంటల కరెంట్​ అంటూ అబద్ధాలు
– విద్యుత్​ కొరత తీర్చిన ఘనత కేసీఆర్​దే..
– ఎమ్మెల్సీ కవిత ట్వీట్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్​ వస్తుందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కట్టుకథలు చెబుతున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్​ కొరత తీర్చని ఘనత కేసీఆర్​కే దక్కుతుందని చెప్పారు. కరెంటు సరఫరాపై కట్టుకథలు చెప్పడం మానేయాలని సూచించారు. పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు ప్రధాని మోదీ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నదంటూ కిషన్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో చేసిన పోస్టుపై కవిత స్పందించారు. తెలంగాణ విద్యుత్తు పీక్ డిమాండ్ 15,500 మెగావాట్లుగా ఉంటే ఎన్టీపీసీ ద్వారా తెలంగాణకు కేవలం 680 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతుందన్నారు. అంటే తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్‌లో పెద్దపల్లి ఎన్టీపీసీ ద్వారా వస్తున్నది కేవలం నాలుగు శాతం మాత్రమేనని స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img