ఇదే నిజం, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో సీనియర్ పాత్రికేయులు కాసర్ల నరసింహ రెడ్డి సూచనల మేరకు పత్రిక విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశం లో కలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొమ్ము బాలరాజు, గౌరవ అధ్యక్షులు గా అశోక్ రావు ను ప్రధాన కార్యదర్శి గా రొట్టె సురేష్, సలహా దారుడిగా మెడిపెల్లి సుధాకర్, సహాయ కార్యదర్శి గా అడ్డ సతీష్,కోశాధికారిగా విజయ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పత్రిక విలేకరులు పాల్గొన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొమ్ము బాలరాజు మాట్లాడుతూ అందరినీ కలుపుకొని నడుస్తున్నాని అన్నారు. తనను అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.