జాతీయ ఉత్తమనటి కృతిసనన్ నిర్మాతగా మారింది. బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పి.. అందులో తొలి ప్రయత్నంగా ‘దో పత్తీ’ పేరుతో మూవీని నిర్మించింది. నిర్మాతగా తన అనుభవాలను ఇటీవల అభిమానులతో పంచుకున్నారు కృతిసనన్. ‘నాపై నాకు నమ్మకాన్ని పెంచిన సినిమా ‘దో పత్తీ’. ‘నటనతోపాటు నిర్మాణంలో కూడా రాణించగలనన్న ఆత్మవిశ్వాసం ఈ సినిమా నాకు ఇచ్చింది. సవాల్గా తీసుకొని ఈ సినిమాను నిర్మించాను. స్క్రిప్ట్ దగ్గర్నుంచి అన్ని విభాగాల్లో భాగం అయ్యాను. ఫలితంగా బడ్జెట్ని అర్థం చేసుకోగలిగాను. రోజుకు 16 నుంచి 17 గంటలు కేవలం ఈ సినిమా కోసమే పనిచేశాను. త్వరలోనే గర్వంగా ప్రేక్షకుల ముందుకు తెస్తా.’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది కృతి సనన్. ప్రస్తుతం కృతి చేతిలో ‘క్రూ’ అనే సినిమా కూడా ఉంది. ఇందులో కరీనా కపూర్, టబుతో కలిసి నటిస్తున్నది కృతి. ఈ నెల 29న ఈ సినిమా విడుదల కానుంది