HomeరాజకీయాలుKTR : రైతుల కోసమే కామారెడ్డికి సీఎం

KTR : రైతుల కోసమే కామారెడ్డికి సీఎం

– ఇతర పార్టీల డబ్బులు తీసుకోండి
– ఓటు మాత్రం బీఆర్ఎస్ కే వేయండి
– ఢిల్లీ దొరలతో కొట్లాడటం మాకు కొత్త కాదు
– మంత్రి కేటీఆర్​ వెల్లడి

ఇదేనిజం, కామారెడ్డి​: ముఖ్యమంత్రి కేసీఆర్​ రైతుల కోసమే కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. ఇతర పార్టీలు డబ్బులు తీసుకోండి.. కానీ బీఆర్ఎస్​ పార్టీకే ఓటు వేయండి అంటూ కేటీఆర్​ పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి సెగ్మెంట్​ గురించే చర్చ జరుగుతోందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన కామారెడ్డి జిల్లా బిక్కనూరులో జరిగిన బీఆర్ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి ప్రసగించారు. కామారెడ్డి రైతుల కల నెరవేర్చడానికే ఆయన పోటీ చేస్తున్నారని తెలిపారు. 9న కేసీఆర్‌ నామినేషన్‌ వేయబోతున్నారని చెప్పారు. నామినేషన్‌ రోజు వచ్చే ప్రజలను చూసి ఇతర పార్టీలవాళ్లు పోటీ చేసేందుకే భయపడాలి. ‘సోనియాను బలిదేవత అని రేవంత్‌రెడ్డే అన్నారు. రాహుల్‌ చెప్పినట్టు దొరలకు, ప్రజలకు మధ్య పోరాటమిది. దిల్లీ దొరలకు.. గల్లీ ప్రజలకు మధ్య ఎన్నికల పోరాటం జరుగుతోంది. ఢిల్లీ అహంకారం, ఢిల్లీ దొరలతో కొట్లాడటం మాకు కొత్త కాదు. తెలంగాణ ఇస్తామని 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌కు 55 ఏళ్ల అవకాశం ఇస్తే ఎందుకు కరెంటు, నీళ్లు ఇవ్వలేదు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img