హైదరాబాద్, ఇదేనిజం : అక్రమంగా తరలిస్తున్న గంజాయి బ్యాగులను స్వాధీనంచేసుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కేసు వివరాలను డీఆర్ఐ డైరెక్టర్ ఆఫ్ రెవేన్యూ ఇంటలిజేన్స్ అధికారులు వెల్లడించారు. ఈస్ట్గోదావరి నుంచి ఉత్తర్ప్రదేశ్కు చెందిన (టాటా ట్రక్) భారిలారిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని అధికారులకు సమాచారం అందడంతో హైదరాబాద్ విజయవాడ పంతంగి టోల్ ప్లాజ వద్ద లారీలను అపి తనికిచేశారు. అనుమానంతో ఆదారిలో వచ్చే ఒక పెద్ద టాటా ట్రక్ కంటేనర్ లారీ కనిపించడంతో వేంటనే దాన్ని ఆపి సోదచేయగా లారి డ్రైవర్ క్యాబిన్ కిందబాగంలో ఒక పెద్ద ఆరలో దాదాపు 1427 కీలో గంజాయి బ్యాగులు కనిపించడతో అధికారులు వాటిని స్వాధీనంచేసుకున్నారు. మార్కెట్ విలువ దాదాపు రూ.3.56 కోట్లు ఉంటుదని అధికారుల అంచనా వేశారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని పై ఎన్పీఎస్ యాక్డు ప్రకారం కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించారు