– శంకర్ నాయక్ను గెలిపిద్దాం
– కాంగ్రెస్ మీటింగ్ ల్లో ఖాళీ కుర్చీలు
– రైతులను బిచ్చగాళ్ల అన్న రేవంత్ కు బుద్ధి చెప్పాలి
– మహబూబాబాద్ రోడ్ షోలో మంత్రి హరీశ్ రావు
ఇదేనిజం, మహబూబాబాద్: మానుకోట దమ్మేంటే కాంగ్రెస్, బీజేపీలకు చూపించాలని మంత్రి హరీశ్ రావు పిలపునిచ్చారు. ఈ నియోజకవర్గంలో శంకర్ నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. శనివారం మహబూబాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. రైతులను బిచ్చగాళ్లతో పోల్చారని.. అటువంటి వ్యక్తిని గెలిపిద్దామా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీల మీటింగుల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ మీటింగ్ అంటే జన సముద్రంలా ఉన్నాయన్నారు. సమైక్యవాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట ప్రజలు తరిమికొట్టారు. మానుకోటకు మట్టికి, రాళ్లకు దండం అని పేర్కొన్నారు. ఆ దెబ్బతో సమైక్యవాదులు వెనుకకు పరుగెత్తారు. ఇప్పుడు కూడా అలాంటి చైతన్యం రావాలి. తెలంగాణ మీద దండెత్తడానికి వస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మానుకోట దమ్మేంటో చూపించాలన్నారు.
కాంగ్రెస్ ఉంటే మహబూబాబాద్ జిల్లా అయ్యేదా?
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మహబూబాబాద్ జిల్లా అయ్యేదా? అని ప్రశ్నించారు. ఈ జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చేదా? అని ప్రశ్నించారు.
తండాలు గ్రామ పంచాయితీలు అయ్యేవా? పోడు భూములకు పట్టాలు వచ్చేవా? అని అడిగారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కర్ణాటకలో ప్రచారం చేసి 5 గ్యారంటీలు అని ఊదరగొట్టి మోసం చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ఏ విషయం మీద పూర్తి అవగాహన ఉండదు. కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి నెత్తిమీద కట్టాల్నా? బూతులు మాట్లాడే నాయకులు కావాలా? భవిష్యత్తు అందించే నాయకుడు కావాలా? అనేది ప్రజలు తేల్చుకోవాలన్నారు. ‘కాల్వల్లో తుమ్మచెట్లు మొలిచినయి.. నేడు రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు వస్తున్నయి.. బోరింగులు మాయమైపోయినయి.. ఇంటింటికీ నల్లా నీళ్లు వస్తున్నాయని హరీశ్రావు తెలిపారు. త్వరలో రుణమాఫీ చేస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు.