Homeహైదరాబాద్latest NewsLiqour : మందుబాబులకు కిక్కెక్కించే వార్త.. ఇకపై రూ.50లకే మద్యం లభ్యం..!!

Liqour : మందుబాబులకు కిక్కెక్కించే వార్త.. ఇకపై రూ.50లకే మద్యం లభ్యం..!!

Liqour : తెలంగాణలో మద్యం ధరలపై రూ.50కి మద్యం అందుబాటులోకి వస్తుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Xలోని కొన్ని పోస్టుల ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాక్‌లలో 60, 90, 180 ఎంఎల్ సైజుల్లో రూ.50 నుంచి మద్యం అందించనుంది. కర్ణాటకలో ఈ విధానం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేస్తుంది అని సమాచారం. ఈ విధానం అమలైతే, సామాన్యులకు మద్యం తక్కువ ధరలో లభ్యమవుతుంది. అయితే ఈ వార్తలపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ నుంచి లేదా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంతవరకు వెలువడలేదు. మరోవైపు, ఇటీవల తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే బీర్ల ధరలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మద్యం ధరలను కూడా పెంచనుంది సమాచారం.

Recent

- Advertisment -spot_img