ఇదే నిజం, రాయికల్ : జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ శివారులోని సామూహిక స్మశాన వాటికలో మృతదేహాలు పూర్తిగా కాలకపోవడంతో వాటి తలల పుర్రెలు పంట పొలాలలో, రహదార్లలో దర్శనమిస్తున్నాయి. దగ్ధం కాని తలల పుర్రెలు కనబడటంతో పొలం పనులకు వెళ్లే రైతులు, ప్రజలు భయపడుతున్నారు. మృతదేహాలు పూర్తిగా దహనం అయ్యే వరకు కుటుంబ సభ్యులు దృష్టి పెడితే ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా అరికట్టవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.