అప్లికేషన్స్ నింపేందుకు అక్టోబర్ 15 డెడ్లైన్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకటించింది. అప్లికేషన్స్ నింపేందుకు అక్టోబర్ 15 డెడ్లైన్గా నిర్ణయించింది. టీఎస్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుంది.
ఛార్జీలు ఇవే..
ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000, లే అవుట్ అప్లికేషన్ ఫీజు రూ.10వేలు, రెగ్యులరైజేషన్ ఫీజులు 100 గజాల లోపు ప్లాట్లకు గజానికి రూ.200 ఉంటుందని, 100 గజాల నుంచి 300 గజాల వరకు గజానికి రూ.400 ఉంటుందని, రెగ్యులరైజేషన్ ఫీజు 300 గజాల నుంచి 600 వరకు గజానికి రూ.600 రెగ్యులరైజేషన్ చార్జీ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 26వ తేదీ వరకు కటాఫ్ డేట్గా ఫిక్స్ చేసింది.