హైదరాబాద్లోని సైదాబాద్లో మద్యం మత్తులో తాళ్లపల్లి రమేష్(45) వ్యక్తి హల్చల్ చేశాడు. రమేష్.. మద్యానికి బానిసకావడంతో ఇవాళ ఉదయం అతడి భార్య, కుమారుడు మందలించారు. దీంతో రమేష్.. విద్యుత్నగర్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోని వాటర్ ట్యాంక్పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. స్థానికుల సమాచారంతో చైతన్యపురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రమేష్ను కాపాడారు.