Homeజిల్లా వార్తలువిరహత్​ అలీ సన్మాన సభను విజయవంతం చేయండి

విరహత్​ అలీ సన్మాన సభను విజయవంతం చేయండి

ఇదే నిజం, జగదేవ్ పూర్: టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విరహత్​ అలీ సన్మానసభను విజయంతం చేయాలని టీయూడబ్ల్యూజే సిద్దిపేట జిల్లా కోశాధికారి డీ కృష్ణ, ఐజేయూ సభ్యుడు బాల్​ నర్సయ్య పిలుపునిచ్చారు. ఇటీవల విరహత్​ అలీ టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో గజ్వేల్ పట్టణంలోని మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో ఈ నెల 10 న సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న సన్మాన సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం జగదేవ్ పూర్ లో వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో జర్నలిస్టు సంఘాల నాయకులు నర్సింహులు, పరుశురాం, బలరాం, తదితరులు పాల్గొన్నారు.‌

Recent

- Advertisment -spot_img