Homeహైదరాబాద్latest Newsభోపాల్ లో వివాహితతో పారిపోయిన వ్యక్తికి దేహశుద్ధి

భోపాల్ లో వివాహితతో పారిపోయిన వ్యక్తికి దేహశుద్ధి

జనరల్ డెస్క్, హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జాయినీ జిల్లాలో దారుణం జరిగింది. వివాహిత మహిళతో కలిసి పారిపోయిన ఘటనలో స్థానికులు ఓ వ్యక్తి పట్ల హీనంగా ప్రవర్తించారు. అతనికి దేహశుద్ధి చేశారు. బలవంతంగా మూత్రం తాగించారు. ఆ మహిళతో చెప్పుతో కొట్టించారు. ఈ వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మూడు రోజుల క్రితం భట్‌పచ్లానా పోలీస్ స్టేషన్ పరిధిలోని భిల్ఖేడి గ్రామంలో బంజారా కమ్యూనిటీకి చెందిన వివాహిత మహిళతో కలిసి ఒక వ్యక్తి పారిపోయాడు. మహిళ కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని చితకబాదారు. బాధిత వ్యక్తిని సంప్రదించినట్లు పోలీసులు చెప్పారు. ఫిర్యాదు చేసేందుకు అతడు నిరాకరించాడని, అయినా చట్టపరంగా చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img