మంచు మోహన్ బాబు, ఆయన కొడుకు మనోజ్ మధ్య ఆస్తి విషయంలో గొడవ జరిగి, ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే మంచు మనోజ్ బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చాడు. తాజాగా మంచు మనోజ్కి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కాలికి గాయం కావడంతో భార్య మౌనికతో కలిసి ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో వైద్యులు సిటీ స్కాన్ , ఎక్స్ రే పరీక్షలు నిర్వహించారు. మెడలోని కండరాలపై స్వల్ప గాయం ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మంచు మనోజ్ కుడి కాలు కండరాల నొప్పితో ఆసుపత్రికి వచ్చారు. సిటీ స్కాన్ మరియు ఎక్స్-రే నివేదికలు నార్మల్ గా ఉందని తెలిపారు. మంచు మనోజ్కి రెండు గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. మంచు మనోజ్ త్వరలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లనున్నారు.