Homeహైదరాబాద్latest NewsAP : రూ. 5000 కు ఓటు అమ్ముకున్న ఎస్సై..డ్యూటీ నుంచి సస్పెండ్ చేసిన ఎన్నికల...

AP : రూ. 5000 కు ఓటు అమ్ముకున్న ఎస్సై..డ్యూటీ నుంచి సస్పెండ్ చేసిన ఎన్నికల సంఘం

ఎన్నికల విధుల్లో ఉన్న ఓ అధికారి బద్ధకంతో ఓటును అమ్ముకున్నాడు. అమ్ముకోవడమంటే పార్టీ నాయకులు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటు వేయడమే మనకు ఇంతవరకు తెలుసు. కానీ ఈయన చేసిన పని చూస్తే తలదించుకోవాల్సి వస్తుంది. పోలీస్ డ్యూటీలో ఉన్న తను పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో పాల్గొనకుండా వేరేవాళ్లతో ఓటు వేయించాడు. అందుకు తాను తీసుకున్న సొమ్ము రూ. 5000. ఓటుపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయనను ఎన్నికల సంఘం డ్యూటీ నుంచి సస్పెండ్ చేసింది.

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు.

మార్చిలో ఎన్నికల బదిలీల్లో భాగంగా మంగళగిరి స్టేషన్‌కు వచ్చారు. ఆయనకు సొంతూరు కురిచేడులో ఓటు ఉంది. ఖాజాబాబుతో ఓటు వేయిస్తానని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5వేలు పుచ్చుకొని, ఆ మొత్తాన్ని ఎస్సైకి ఆన్‌లైన్‌లో పంపారు. సదరు నాయకుడు డబ్బులు పంపిణీ చేస్తూ ప్రకాశం జిల్లా పోలీసులకు చిక్కాడు.

తనను విచారించిన పోలీసులతో ఎవరెవరికి డబ్బులు ఇచ్చిందీ తెలిపాడు. వాటిలో ఖాజాబాబు డబ్బులను వారి బంధువులకు ఇచ్చినట్లు చెప్పగా, పోలీసులు వారిని విచారించారు. ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎస్సైపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీకి నివేదిక పంపారు. ఖాజాబాబును సస్పెండ్‌ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీచేశారు.

Recent

- Advertisment -spot_img