Earthquake: మణిపూర్లో మరో భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైందని జాతీయ భూకంప కేంద్రం నివేదించింది. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉంది. ఈ భూకంపం వల్ల జరిగిన నష్టం గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.