Homeసినిమానటి త్రిషకు సారీ చెప్పిన మన్సూర్​

నటి త్రిషకు సారీ చెప్పిన మన్సూర్​

– తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదని వెల్లడి
– వైరల్​గా మారిన ట్వీట్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: నటి త్రిషపై ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ .. తాజాగా ఆమెకు క్షమాపణలు చెప్పాడు. త్రిషపై తనకు ఎలాంటి చెడుద్దేశం లేదన్నాడు. తాను సరదాగా ఆ వ్యాఖ్యలు చేశానన్నాడు. ఆమె పెళ్లికి తాను మంగళసూత్రం ఇచ్చి ఆశీర్వదించాలనుకుంటున్నానని తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మన్సూర్‌ పోస్ట్‌పై త్రిష పరోక్షంగా స్పందించారు. ‘తప్పు చేయడం మానవ సహజం. క్షమాపణ అత్యున్నతమైనది’అని తాజాగా ఆమె ట్వీట్‌ చేశారు. మన్సూర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తాను ఎన్నో రేప్‌ సీన్లలో నటించానని.. ‘లియో’లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నట్లు చెప్పాడు. ఆ సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించిందన్నాడు. సంబంధిత వీడియో త్రిష దృష్టికి వెళ్లగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్లే అందరికీ చెడ్డపేరు వస్తోందని పేర్కొన్నారు. ‘లియో’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌, ప్రముఖ హీరో చిరంజీవి, నితిన్‌, రోజా, రాధిక, గాయని చిన్మయి తదితరులు మన్సూర్‌ వ్యాఖ్యలను ఖండించారు. త్రిషకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. మరోవైపు మన్సూర్‌ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి.. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే అతడిపై కేసు నమోదు అయ్యింది. ఇదిలా ఉండగా, త్రిషకు తాను క్షమాపణలు చెప్పనని తొలుత మన్సూర్ ఓ ప్రెస్‌మీట్‌లో తెలిపాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అతడు వెనక్కి తగ్గి తాజాగా క్షమాపణలు చెప్పాడు.

Recent

- Advertisment -spot_img