మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి, తిరిగి ప్రభుత్వంలోకి రావాలని ప్రయత్నిస్తున్న మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) మధ్య జరుగుతున్న తీవ్ర పోటీపైనే అందరీ దృష్టి ఉంది. అయితే ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. NDA కూటమి 216 చోట్ల లీడింగ్ లో ఉంది. మరోవైపు INDIA కూటమి 60 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. దీంతో మరాఠా కిరీటం NDA దే అని తెలుస్తుంది.