Homeక్రైంజమ్మూలో భారీ ఎన్​ కౌంటర్

జమ్మూలో భారీ ఎన్​ కౌంటర్

– అయిదుగురు ఉగ్రవాదులు హతం
– సామ్నో ప్రాంతంలో కాల్పులు

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: జమ్మూ కశ్మీర్​లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కుల్గాం జిల్లా సామ్నో ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. మృతులను లష్కర్‌ తోయిబాకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. సామ్నో ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. చీకటి పడటంతో.. పకడ్బందీ నిఘా మధ్య ఆపరేషన్‌కు విరామం ఇచ్చారు. మళ్లీ రెండో రోజు శుక్రవారం తెల్లవారుజామున ఇరుపక్షాల నడుమ కాల్పులు జరిగాయి. మొత్తం 18 గంటలపాటు సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో అయిదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img