తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు మే 13న పోలింగ్ జరగనుంది. దీంతో పోలింగ్ రోజును వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ సీఈవో వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఉద్యోగులు తమ రాష్ట్రానికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళితే వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ఏపీలో కూడా మే 13న సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.