Homeతెలంగాణక‌ళ్యాణ ల‌క్ష్మి చెక్కులిచ్చి.. త‌న ఇంటి వ‌ద్దే వారంద‌రితో క‌లిసి భోజనం చేసిన మంత్రి

క‌ళ్యాణ ల‌క్ష్మి చెక్కులిచ్చి.. త‌న ఇంటి వ‌ద్దే వారంద‌రితో క‌లిసి భోజనం చేసిన మంత్రి

వనపర్తి లోని తన నివాసంలో 421 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేసి వారితో కలిసి కళ్యాణవిందు (సహపంక్తి) భోజనం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇది సంక్షేమ రాష్ట్రం అని అన్నారు..

మంత్రి సందేశం ఆయ‌న‌ మాట‌ల్లో..

  • పేదింటి ఆడబిడ్డలకు అండ కళ్యాణలక్ష్మి
  • అందరూ బాగుండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష
  • కరోనాతో ప్రపంచం స్థంభించినా తెలంగాణలో సంక్షేమ పథకాలు ఆగలేదు
  • కేసీఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమయింది
  • దేశంలో ఎక్కడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్లు సంక్షేమ పథకాలు లేవు
  • సామాన్య ప్రజల అవసరాల పట్ల అవగాహన ఉంటేనే ఇలాంటి పథకాల అమలు సాధ్యమవుతుంది.
  • తెలంగాణ ఉద్యమంలో 14 ఏండ్లు ప్రజల కష్టాలను దగ్గరుండి చూశాం కాబట్టే దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రూపుదిద్దుకున్నాయి.
  • ప్రజల ఆశీర్వాదమే తెలంగాణ ప్రభుత్వానికి బలం, బలగం

Recent

- Advertisment -spot_img