Homeహైదరాబాద్latest Newsబాలిక మిస్సింగ్ కేసు..శవమై తేలింది

బాలిక మిస్సింగ్ కేసు..శవమై తేలింది

  • అనుమానస్పద స్థితిలో శవమై తేలిన బాలిక

ఇదేనిజం, శేరిలింగంపల్లి : మియాపూర్ నడిగడ్డ తాండలో బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. ఈ ఘటన మియాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ దుర్గా రామ లింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మ తండాకు చెందిన బాణోత్ నరేష్ శారద దంపతులకు ఒక కుమారుడు , కూతురు వసంత(13) ఉన్నారు. గత 20 రోజుల క్రితం స్వగ్రామం నుంచి నగరానికి వచ్చి మియాపూర్ నడి గడ్డ తండాలో ఉంటూ జిప్టొలో పనిచేస్తున్నాడు. వసంత 7 వతరగతి చదువుతుంది. ఈ క్రమంలో ఈ నెల 7 వతేదిన ఉదయం సమయంలో తండ్రి నరేష్ ,శారద చదువుకోమని చెప్పి మందలించి పనులకు వెళ్లారు. రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో కనిపించక పోవడంతో తల్లిదండ్రులు చుట్టూ పక్కల ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో తండ్రి నరేష్ పిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో గురువారం రాత్రి సమయంలో నదిగడ్డ సమీపంలో చెట్ల పొదల్లో దుర్వాసన వస్తుందని అక్కడ స్థానికులు మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా మృత దేహం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వస్తుంది. మృత దేహం పై ఉన్న
దుస్తులను గమనించి బాలికను వసంతగా గుర్తించి తల్లి దండ్రులకు సమాచారం అందించారు. వసంత అనుమానాస్పద స్థితిలో కుళ్లి పోయిన స్థితిలో మృత దేహం లభించడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. బాలిక మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img