MLA Toilet Opening : తమిళనాడులో ఎమ్మెల్యే టాయిలెట్ ఓపెనింగ్ సంచలనం రేపింది. తమిళనాడులోని తిరువొత్తియూర్ నియోజకవర్గంలో డిఎంకె ఎమ్మెల్యే కె.పి. శంకర్ టాయిలెట్తో కూడిన బస్ స్టాప్ను ప్రారంభించాడు. అయితే ఈ కార్యక్రమం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే టాయిలెట్ ఓపెనింగ్కు కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.పి. శంకర్ను రూ.500 నోట్ల దండలతో అమ్మాయిలు సత్కరించారు. అలాగే బుల్డోజర్ తో ఎమ్మెల్యే పై పూల వర్షం కురిపించారు. అయితే ఎమ్మెల్యే హడావిడి చూసిన జనాలు అంత షాక్ అయ్యారు. బస్సు స్టాండ్ టాయిలెట్ కన్నా ఓపెనింగ్ వేళ ఎమ్మెల్యే చేసిన హడావిడి, ఖర్చుపై ట్రోల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.