Modi : మహాకుంభమేళా త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ (Modi) ‘పవిత్ర స్నానం’ చేసారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న చారిత్రాత్మక మహాకుంభమేళాలో ఈరోజు అష్టమి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవిత్ర స్నానం ఆచరించారు. ప్రయాగ్రాజ్లోని సంగం ఘాట్లోని త్రివేణి సంగమంలో స్నానం చేసిన ప్రధాని మోదీ, పవిత్ర గంగా జలానికి అర్ఘ్యాన్ని సమర్పించించారు. 12 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళాకు భారతదేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి ఇప్పటివరకు 38 కోట్లకు పైగా యాత్రికులు వచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.