Homeక్రైంతహసీల్దార్‌ నాగరాజు లాక‌ర్‌లో 1.5 కిలోల బంగారం

తహసీల్దార్‌ నాగరాజు లాక‌ర్‌లో 1.5 కిలోల బంగారం

హైద‌రాబాద్ః ఏసీబీ చ‌రిత్రలో సంచ‌ల‌నం సృష్టించిన కీసర తహసీల్దార్‌ నాగరాజు రూ.1.1 కోట్ల లంచం కేసులో రోజురోజుకో కొత్త సాక్ష్యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ కేసులో విచార‌ణ చేస్తున్న ఏసీబీకి విస్తుకొలిపే నిజాలు తెలుస్తున్నాయి. విచార‌ణ‌లో భాగంగా.. బుధవారం తహసీల్దార్‌ నాగరాజుకు చెందిన బ్యాంకు లాకర్‌ను ఏసీబీ అధికారులు తెరిచారు. ఈ లాకర్‌‌ను తెరవగా అధికారులకు దిమ్మ‌తిరిగిపోయేలా రూ.57 లక్షల పైబడి విలువైన బంగారు, వజ్రాభరణాలను బ‌య‌ట‌ప‌డ్డాయి. వజ్రవైఢూర్యాలతో కూడిన ఆభరణాలు అందులో ఉన్నాయి. వీటన్నింటినీ ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.
బంధువు పేరిట లాక‌ర్‌
నాగరాజు బంధువైన జి.జే.నరేందర్‌ పేరిట అల్వాల్‌లోని సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు లాకర్‌ను ఏసీబీ గుర్తించి ఓపెన్ చేశారు. అందులో 1532 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్‌ చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్‌ చేయనున్నారు. నాగరాజు వేధింపులకు గురైన ఓ ఎస్పీ ర్యాంకు మాజీ పోలీస్‌ అధికారి మీడియా ముందుకు అతడి అవినీతి బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు. కస్టడీ ముగిసినా దరిమిలా నాగరాజు అక్రమాలపై ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇక నాగరాజు వేసిన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. రెండు రోజుల్లో ఏసీబీ న్యాయస్థానం బెయిల్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img