Homeహైదరాబాద్latest News‘నాటు నాటు’ సాంగ్ చాలా ఇష్టం : Ed Sheeran

‘నాటు నాటు’ సాంగ్ చాలా ఇష్టం : Ed Sheeran

తన తదుపరి కాన్సర్ట్‌ కోసం ఇటీవల భారత్‌కు వచ్చిన ప్రముఖ పాప్‌ సింగర్‌ ఎడ్‌ షీరన్‌ (Ed Sheeran).. ఇండియా అంటే తనకెంతో ఇష్టమన్నారు. ఇక్కడి ప్రజలు తన పాటలను ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై ఇష్టాన్ని తెలియజేశారు. ‘దాదాపు ఏడాది క్రితం నా స్నేహితులతో కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూశా. ఇదొక అద్భుతమైన చిత్రం. ‘నాటు నాటు’డ్యాన్స్‌ చాలా బాగుంది. టెక్నికల్​గా ఈ సాంగ్ నాకెంతో నచ్చింది’అని పేర్కొన్నారు. దీనిపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ముంబయిలో ఉన్న ఎడ్‌ షీరన్‌ కోసం బాలీవుడ్‌ సెలబ్రిటీలు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. షారుక్‌ ఏర్పాటు చేసిన పార్టీలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ భగ్నానీ, ఫర్హా ఖాన్‌, ఆయుష్మాన్‌ ఖురానా, అర్మాన్‌ మాలిక్‌ తదితరులు పాల్గొన్నారు. షారుక్‌తో కలిసి షీరన్‌ డ్యాన్స్‌ చేశారు. ‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా’ పాటకు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్‌గా మారాయి. శనివారం రాత్రి ముంబయిలో ఎడ్‌ షీరన్‌ కాన్సర్ట్‌ జరగనుంది.

Recent

- Advertisment -spot_img