సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇటీవలే అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ను కోర్టు విచారించింది. ఈ క్రమంలో తదుపరి విచారణ జనవరి 3కు వాయిదా వేస్తునట్లు ప్రకటించింది. ఆ రోజే నాంపల్లి కోర్టు తుది తీర్పు ను వెలువరించనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై ఉన్నారు.