HomeతెలంగాణNano urea : నానో యూరియాతో. రైతులకు ప్రయోజనాలు -మంత్రి నిరంజన్ రెడ్డి

Nano urea : నానో యూరియాతో. రైతులకు ప్రయోజనాలు -మంత్రి నిరంజన్ రెడ్డి

Nano urea : ప్రపంచ వ్యవసాయానికి నానో యూరియా ఆదర్శమే కాకుండా, రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వ్యవసాయ యూనివర్సిటీ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు

రూపకర్త భారతీయుడు

భారతీయుడైన రమేష్ రాలియా దీనిని కనుగొని భారత రైతాంగం శ్రేయస్సు దృష్ట్యా అమెరికా ఉద్యోగాన్ని వదులుకుని ఆ టెక్నాలజీని మన దేశంలోని ఇఫ్కో సంస్థకు అందించారని అన్నారు.
36 వేల సహకార సంఘాల సమాఖ్య అయిన ఇఫ్కో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అని చెప్పారు.11 వేల మంది రైతుల పొలాలలో నానో యూరియాను ప్రయోగించి ఫలితాలు పరిశీలించి మార్కెట్ లోకి విడుదల చేశారని మంత్రి వెల్లడించారు

ద్రవరూపం లో

తొలిసారి యూరియాను ద్రవరూపంలో నానో టెక్నాలజీలో అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. దీనిమూలంగా ఎరువుల సంచులను తరలించే పెద్ద ప్రక్రియను సులభతరం చేశారని కొనియాడారు

ప్రోత్సాహం
నానో యూరియా వైపు రైతులను మళ్లించాలని నిర్ణయించాం.ట్రేడర్లు, వ్యాపారులు, వ్యవసాయ అధికారులు , శాస్త్రవేత్తలు రైతులను ఈ దిశగా మళ్లించేందుకు సహకరించాలి.నానో యూరియా వాడకం మూలంగా మొక్కలకు పత్రహరితం ఎక్కువగా అంది పంట వేగంగా ఎదుగుతుంది

దేశంలో వినియోగించే 70 శాతం యూరియా విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం
అత్యధిక ఎరువులు, యూరియా వాడకం మూలంగా చెరువులు, కుంటలు, భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి.ఇటువంటి అనేక దుష్పరిణామాలను అరికట్టడం, రైతాంగానికి మేలు చేయాలి అన్న ఉద్దేశంతో తెలంగాణలో నానో యూరియాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు

500 మిల్లిలీటర్లు బస్తాతో సమానం


500 మిల్లీలీటర్ల నానో యూరియా ఒక యూరియా బస్తాతో సమానమని అన్నారు.నానో యూరియా 80 శాతం వరకు పనిచేసి మొక్క ఎదుగుదలకు తోడ్పడుతుంది

Recent

- Advertisment -spot_img