Homeఆంధ్రప్రదేశ్Jagan లో ఓటమి భయం మొదలైంది

Jagan లో ఓటమి భయం మొదలైంది

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

ఇదే నిజం, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డికి ఆయన కళ్ల ముందు దారుణ ఓటమి కనిపిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేశ్‌ అన్నారు. చివరికి సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. పులివెందులలో జగన్ పునాదులు కదులుతున్నాయి.. ఆ అసహనం వల్లే అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు. కడప జిల్లాలో ప్రొద్దుటూరు ఇన్​చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి, పులివెందుల ఇన్​చార్జి బీటెక్ రవి అరెస్టుతోనే ప్రతిపక్షం అంటే జగన్ ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోందని లోకేశ్ విమర్శించారు. పులివెందులలో టీడీపీ స్పీడ్ పెరగడంతో తన మార్కు అక్రమ కేసులతో భయపెట్టే చర్యలకు జగన్‌ దిగారని విమర్శించారు. ఏ సీఎం అయినా, వారి సొంత జిల్లాలో చేసిన అభివృద్ది పనుల గురించో.. కట్టిన ప్రాజెక్టుల గురించో.. తెచ్చిన కంపెనీల గురించో చెబుతారు.. కానీ జగన్ మాత్రం ఏ నియోజకవర్గంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టారో మాత్రమే చెప్పగలరని ఆయన సెటైర్ చేశారు ఈ అక్రమ కేసులు, బెదిరింపు రాజకీయాలు వైసీపీని బతికించలేవని చెప్పారు. అక్రమ పద్ధతుల్లో సహకరిస్తున్న పోలీసులు లేకపోతే రాష్ట్రంలో వైసీపీ అనే పార్టీయే లేదని ధ్వజమెత్తారు. జగన్ పెట్టే ప్రతి కేసు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతుంది తప్ప ప్రజల పక్షాన తమ పోరాటాన్ని ఆపదని నారా లోకేశ్ స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img