సీబీఐ నీట్-యూజీ 2024 పరీక్షపేపర్ లీక్ కేసు దర్యాప్తులో దూకుడు పెంచింది. నీట్ పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. జార్ఖండ్లోని ధన్బాద్కు చెందిన నిందితుడు అవినాష్ అలియాస్ బంటీకి చెందిన 16 ఫోన్లను సిబిఐ అధికారులు చెరువు నుండి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. నిందితుడిని బీహార్లోని పాట్నా సీబీఐ కోర్టులో హాజరుపరచగా, విచారణ నిమిత్తం కోర్టు జూలై 30 వరకు రిమాండ్ విధించింది.