ఇటీవల లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్పై రైతులు, గ్రామస్థులు దాడి చేశారు. అయితే ఈ ఘటనలో రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసారు. ప్రస్తుతం రైతులు సంగారెడ్డి జైలులో ఉన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి) బృందం రైతలతో సమావేశమైంది. ఎన్హెచ్ఆర్సీకి చెందిన 8 మంది సభ్యుల బృందం ఈ వివాదాన్ని సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై ప్రతినిధులు విచారణ చేపట్టారు. లగచర్ల కేసులో పూర్తిస్థాయి విచారణ ఎన్హెచ్ఆర్సీ చేపట్టింది. అయితే విచారణ ఈ నెల 26 వరకు కొనసాగనుంది.