మూసీ సుందరీకరణను ఎవరూ వ్యతిరేకించడం లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కారం కాకుండా మూసీ సుందరీకరణ జరగదని చెప్పారు. ఇప్పుడున్న మూసీకి రెండువైపులా రిటైనింగ్ వాల్ను నిర్మించి అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న పేదల ఇళ్లను కూల్చవద్దన్నారు. హైదరాబాద్ లోని గాంధీనగర్ డివిజన్ ఆంధ్రాకేఫ్ ఎక్స్ రోడ్లో శుక్రవారం MLA గోపాల్తో కలిపి సేవరేజ్ లైన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.