న్యూడిల్లీ : నువాఖై జుహార్ శుభ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ, “మన రైతుల కృషిని గుర్తించి, పండుగ జరుపుకోవడమే ఈ నువాఖై ప్రత్యేకత. వారి కృషి వల్లనే మన దేశానికి ఆహారం లభిస్తోంది. ఈ పవిత్రమైన రోజు ప్రతి ఒక్కరికీ శ్రేయస్సు మరియు మంచి ఆరోగ్యాన్ని తేవాలి. నువాఖై జుహార్!” అని ఆకాంక్షించారు.