Homeహైదరాబాద్latest Newsఅయ్యో..! ఈతవనం కాలి బూడిదైంది

అయ్యో..! ఈతవనం కాలి బూడిదైంది

ఇదే నిజం, బుగ్గారం : జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోనీ సిరికొండ, మద్దునూరు ఈతవనం కాలి బూడిదైంది. దాదాపు 300 పైచిలుకు ఈతచెట్లు కాలిపోయాయి. గీత కార్మికులకు భారీ నష్టం సంభవించింది. దాదాపు 100 గీత కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తులు పొలాలలో చెత్త చెదారం కాల్చడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. బుగ్గారం మండలం గౌడ సంఘం అధ్యక్షుడు మూల శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. పాకాల శ్రీనివాస్, బూమన్న గౌడ్, తిరుపతి గౌడ్, గౌడ సంఘం సభ్యులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img