సీఎం రేవంత్రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా సర్పంచుల పెండింగ్ బిల్లులపై దృష్టి పెట్టకపోవడం దారుణమన్నారు.
ఇది కూడా చదవండి: వారికి.. తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్..
అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచుల పెండింగ్ బిల్లులను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం ఏమాత్రం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని బండి సంజయ్ కోరారు.
ఇది కూడా చదవండి: ఇప్పుడు రూపాయి లేకుండా అయోధ్యకు వెళ్లండి.. ఇలా..
కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని బండి సంజయ్ ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెండింగ్ బిల్లుల కారణంగా రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులను కూడా ప్రభుత్వ అధికారులు రికార్డు చేయకుండా సర్పంచులను ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: ‘సీఎం రేవంత్ పాలన చూసి KTR తట్టుకోలేకపోతున్నాడు’
గ్రామాభివృద్ధికి సర్పంచులు చేసిన పనులను వెంటనే రికార్డు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం సర్పంచులతో సహా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం పెంచాలని కోరారు. మాజీ సర్పంచులు, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులకు పెన్షన్ మంజూరు చేయాలని బండి సంజయ్ ఆ లేఖలో తెలిపారు.
ఇది కూడా చదవండి: KTR సంచలన వ్యాఖ్యలు.. హామీలు అమలు చేయకపోతే నడిరోడ్డుపై..