Homeక్రైంరేకుల షెడ్ కూలి ఒకరి మృతి

రేకుల షెడ్ కూలి ఒకరి మృతి

– ఆరుగురికి తీవ్ర గాయాలు
– మొయినాబాద్​లో ఘటన

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: నిర్మాణంలో ఉన్న ఓ రేకుల షెడ్‌ కూలి ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం సురంగల్‌ రెవెన్యూ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌ మండలం సురంగల్‌ రెవెన్యూ పరిధిలో ఫైర్‌ఫాక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ అకాడమీ ఆడిటోరియం నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఓ రేకుల షెడ్‌ను నిర్మించారు. సోమవారం దానిపై మరో స్లాబ్‌ వేస్తున్నారు. ఈ క్రమంలో స్లాబ్‌ కూలి షెడ్‌పై పడటంతో అక్కడ పనిచేస్తున్న కోల్‌కతాకు చెందిన బబ్లూ(35) అక్కడికక్కడే మృతి చెందాడు. బిహార్‌కు చెందిన కార్మికులు సునీల్‌, రాకేశ్‌, సంజయ్‌, విజయ్‌, సంతోష్‌, రాజంకుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img