Homeహైదరాబాద్latest Newsపిడుగుపాటుకు ఒకరి మృతి : Crime News

పిడుగుపాటుకు ఒకరి మృతి : Crime News

– మెదక్ జిల్లా కంగ్టిలో విషాదం

ఇదే నిజం, కంగ్టి : పిడుగుపాటుకు ఓ వ్యక్తి చనిపోయిన ఘటన మెదక్ జిల్లా కంగ్టి మండలంలోని భీమ్రా గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సిర్ గొండ (50) మరికొంతమంది కూలీలతో కలిసి పొలం పనులు చేస్తుండగా. మధ్యాహ్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావటంతో అక్కడే ఉన్న రెకుల షెడ్డు కింద తలదాచుకున్నాడు. అదే సమయంలో పిడుగుపడి అక్కడికక్కడే సిర్ గొండ మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కంగ్టి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img