ఛార్టడ్ అకౌంటెంట్స్(CA) ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే టాప్ ర్యాంకర్స్గా నిలిచారు. నవంబర్ 3, 5, 7 తేదీల్లో నిర్వహించిన CA పరీక్షల తుది ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. హైదరాబాద్కు చెందిన హేరంబ్ మహేశ్వరి, తిరుపతికి చెందిన రిషబ్ 508 మార్కులతో సంయుక్తంగా ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు icai.nic.in వెబ్సైట్లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.