హైదరాబాద్, ఇదేనిజం – వినాయక చవితిని పురస్కరించుకుని భాగ్యనగరం నుంచి అంతర్జాతీయ విమానశ్రయం ద్వారా యూకే(లండన్)కు ఏయిర్కార్గో ద్వారా విగ్రహాలను తరిస్తున్నారని ఏయిర్పోర్టు వర్గాలు వెల్లడించారు.. ఈసందర్భంగా ఏయిర్ పోర్ట్ జీహెచ్ఏసీ అధికారులు మాట్లడుతూ… లండన్లోని మనభారతీయలు ఇతర భక్తుల కోసం ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణ హిత గణేష్ ప్రతిమలను హైదరాబాద్నుంచి విమానంలో అక్కడికి తరలించడం జరుగుతుందన్నారు. నగరం నుంచి వినాయక ప్రతిమలను లండన్కు పంపించడం(ఎగుమతి)చేయడం ఇదే మొదటిసారని ఈ విగ్రహాల ఎత్తు 6 ఆంగుళాలు నుంచి 2 అడుగుల ఎత్తువరకు వివిధ పరిమాణాల్లో ఉంటాయని వారు వెల్లడించారు. ఎయిల్ ట్రావేల్ బబుల్ లో భాగంగా ఇటీవలే ప్రారంభమైన బ్రిటిష్ ఎయిర్వేస్ ద్వారా గణనాథులను లండన్కు తరలిస్తున్నమని, విగ్రాహలకు తరలింపుకు ఏలాంటి ఆవరోదకాలు లేకుండా వాటిని ఫ్టైట్, కస్టం విభాగం అధికారులతో కలిసి వాటిని అతి జాగ్రతగా ప్యాక్చేసి పంపుతున్నారు. పర్యవరణ హిత గణనాథులు సహాజసిద్దమైన బయో డిగ్రేడబుల్ బంకమట్టితో తయారుచేస్తున్నారు. ప్రత్యేకంగా విటిలో బంతి పూల విత్తనాలు, వర్మికంపోస్టు నింపి వాటిని నిమజ్జన తరువాత వాడుకోవడానికి ఆవకాశం ఉంటుదని వారు తెలిపారు.