పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దాడులు జరిపిన నేపథ్యంలో.. భారత్లోని 15 నగరాల్లోని మిలటరీ స్థావరాలపై పాకిస్థాన్ దాడులకు ప్రయత్నించి విఫలమైనట్లు సమాచారం. జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్కోట్, బటిండా, లుథియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, ఫలోడి సహా పలు నగరాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఈ దాడులకు యత్నించినట్లు తెలుస్తోంది.
భారత భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండటంతో ఈ దాడి ప్రయత్నాలు విఫలమయ్యాయని, దేశ రక్షణ వ్యవస్థలు గట్టి పట్టుదలతో సమర్థవంతంగా వ్యవహరించాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటన భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం భారత సైన్యం అధిక స్థాయి భద్రతా చర్యలను అమలు చేస్తోంది. ఈ దాడి యత్నాలపై దర్యాప్తు కొనసాగుతోందని, భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలను నిరోధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.