Homeహైదరాబాద్latest Newsరేవంత్ రెడ్డి మరియు పొన్నం ప్రభాకర్ చిత్ర పటాలకు పాలాభిషేకం

రేవంత్ రెడ్డి మరియు పొన్నం ప్రభాకర్ చిత్ర పటాలకు పాలాభిషేకం

ఇదే నిజం కోహెడ: రైతులకు 2లక్షల రూపాయల లోపు రైతు రుణ మాఫీ చేస్తామని నిన్న కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు కోహెడ మండలం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు భీం రెడ్డి, తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గార్ల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు రుణ మాఫీ చేస్తామని ఎన్నికల హామీలో కాంగ్రెస్ నాయకులు,ఎంపీ రాహుల్ గాంధీ వరంగల్ లో జరిగిన రైతు డిక్లరేషన్ లో హామీ ఇచ్చారు. చెప్పిన హామీ మేరకు దాదాపు 31 వేల కోట్ల రూపాయల దాకా రుణమాఫీ తెలంగాణ రైతాంగానికి చేస్తున్నట్లు,ఈ హామీని ఆగస్ట్ 15 లోపు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం లో తెలిపారు. కాంగ్రెస్ అంటేనే రైతుల కోసం నిరంతరం కృషి చేసే పార్టీ అని,ఎంత కష్టం అయినా కూడా ఏక కాలంలో తెలంగాణ రాష్ట్ర రైతులకు 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img