Homeహైదరాబాద్latest Newsముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం !

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం !

ఇదే నిజం దేవరకొండ : చందంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద శనివారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆదేశానుసారం మండల పార్టీ అధ్యక్షులు జర్పుల బాద్య నాయక్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బాద్యా నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఒకే దఫా రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషమన్నారు. ఈ సంతోషకరమైన వార్తతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రైతులు జేజేలు పలుకుతున్నారని వ్యవసాయం దండగ అనే సందర్భం నుండి వ్యవసాయం పండుగల చేసుకునే విధంగా సీఎం కృషి చేశారన్నారు. రైతులు అభివృద్ధి చెందేవిధంగా ఈ ప్రభుత్వం చూస్తుందన్నారు. చందంపేట మండల రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కో అప్షన్ సభ్యులు సాదిక్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాయి రాథోడ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రామ్మి నాయక్, స్థానిక ఎంపిటిసి మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాండు నాయక్, తిరుపతి రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు ఎడ్ల రాములు, యువజన కాంగ్రెస్ నాయకులు పగిళ్ల శివప్రసాద్, యండినాసిర్, భాస్కర్, నక్క నరసింహ, యండి షద్దు, జ్యోషి, మాజీ ఉప సర్పంచ్ శక్రూ నాయక్, బాబు రామ్,రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img